ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్-2021) ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పటికే ఇంజనీరింగ్ ఫలితాలను విడుదల చేయగా, తాజాగా అగ్రికల్చర్ , ఫార్మసీ ఫలితాలను వెల్లడిరచారు. మంగళగిరి లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు..అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశానికి 83,822 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 78,066 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఫలితాల్లో 72,488 (92.85 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. ఈ ఫలితాల్లో 92.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు ఈ నెల 7వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత విధానం ద్వారా మొత్తం 5 విడతలుగా ఈ పరీక్షలను నిర్వహించారు. మొదటి ర్యాంక్ చందం విష్ణు వివేక్ (తూర్పుగోదావరి) సెకండ్ ర్యాంక్ రంగు శ్రీనివాస కార్తికేయ (అనంతపురం జిల్లా) థర్డ్ ర్యాంక్ బొల్లినేని విశ్వాసరావు (హనుమకొండ)లు సాధించారు.