తెలంగాణకు కేంద్రం ఆదేశం
నెల రోజుల గడువు విధింపు
న్యూదిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీకి సంబంధించిన బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 30 రోజుల్లోగా విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రం తమ ఆదేశాల్లో పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014-2017 వరకూ తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఆంధ్రప్రదేశ్కు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు రూ.3,441 కోట్ల అసలు మొత్తం, రూ.3,315 కోట్ల ఆలస్యం చెల్లింపులపై సర్ చార్జీలను చెల్లించాలి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.