Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపీలో కొత్త రైల్వే ప్రాజెక్టులు సాధ్యం కావు… : కేంద్ర ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణే కారణమన్న కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్తగా రైల్వే ప్రాజెక్టులను ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణే కారణమని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ పార్లమెంటు వేదికగా కుండబద్దలు కొట్టారు. వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రైల్వే ప్రాజెక్టులు కోరుతున్న ఎంపీ… రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్రానికి సహకరించేలా చేస్తే… ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు అయినా త్వరితగతిన పూర్తి అవుతాయని మంత్రి వివరించారు. ఏపీలో ప్రస్తుతం రూ.70 వేల కోట్లకు పైగా విలువ కలిగిన రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని వైష్ణవ్‌ తెలిపారు. కొత్త ప్రాజెక్టులను కాస్ట్‌ షేరింగ్‌ పద్దతిన చేపడుతున్నట్లు వెల్లడిరచిన మంత్రి… ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఏపీ తన వాటాగా రూ.1,798 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి కొత్తగా రైల్వే ప్రాజెక్టులను ప్రకటించడం సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img