ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్గా నమోదైంది. కెన్యా నుంచి వచ్చిన మహిళకు పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. సదరు మహిళ ఈ నెల 12న కెన్యా నుంచి చెన్నై వచ్చారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకున్న మహిళ నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు. ఆమెకు ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ కుటుంబసభ్యులకు మాత్రం నెగటివ్ వచ్చినట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరం జిల్లాలో నమోదైన విషయం తెలిసిందే.