ఏపీ రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరామ్కు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆస్పరి మండలం చిన్న హోతూరు, పెద్ద హోతూరులో భూముల కొనుగోలుపై ఐటీ అధికారులు వివరణ కోరారు. ఇటీనా ప్లాంటేషన్ లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో 200 ఎకరాల భూముల కొనుగోలు, భార్య, కుటుంబ సభ్యుల పేర్ల మీద భూముల బదలాయింపు పై ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 90రోజుల్లో వివరణ ఇవ్వాలని ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.