Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఏయూలో ‘గో బ్యాక్‌ సీఎం సార్‌’ పోస్టర్లు

విశాలాంధ్రబ్యూరో-విశాఖపట్నం: ‘గో బ్యాక్‌ సీఎం సార్‌’, ‘రాజధాని అమరావతిని నిర్మించండి’ అంటూ ఆంధ్రయూనివర్సిటీ ప్రాంగణంలో జనజాగరణ సమితి పేరుతో వాల్‌పోస్టర్లు వెలిశాయి. విశాఖ నగరంలో చాలాచోట్ల పోస్టర్లు ఏర్పాటు చేయగా…వాటిని వైసీపీ నేతలు తొలగించినట్లు చెబుతున్నప్పటికీ… ఏయూ ఆవరణలో మాత్రమే ఇవి ప్రత్యక్షమయ్యాయి. వెంటనే యూనివర్సిటీ అధికారులు మూడవ పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేసి యూనివర్సిటీలో ఈ పోస్టర్లు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించడానికి ఇలాంటి పోస్టర్లు కడుతున్నారని, అటువంటి వారిని క్షమించేది లేదని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img