Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

‘ఏ అంశంపైన అయినా మేం చర్చకు రెడీ’..

బీఏసీ సమావేశంలో జగన్‌
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. బీఏసీ సమావేశంలో అచ్చెన్నాయుడికి జగన్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమన్నారు.. అవసరమైతే ఈఎస్‌ఐ స్కామ్‌పై కూడా చర్చిద్దామని అచ్చెన్నకు పంచ్‌ విసిరారు. టీడీపీ ఏం అడిగితే దానిపై చర్చకు సిద్ధమని.. ‘మీరు ఒకటి అంటే మావాళ్లు పది అనగలరు’ అంటూ సీఎం వ్యాఖ్యానించారు.
రాజధాని అంశంపై చర్చ కావాలంటే దానిపైనా కూడా పెడతామన్నారు ముఖ్యమంత్రి జగన్‌. ‘మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే.. మావాళ్లు కూడా చేస్తారు’ అన్నారు. సభకు వచ్చి గౌరవంగా ఉండాలని సీఎం సూచించారు. ‘మీరు 17మంది, మేం 150మంది ఉన్నామని’ సీఎం వ్యాఖ్యానించారట. అన్న అంశాలపై చర్చిద్దామని.. ‘మీ నాయకుడిని కూడా సభకు రమ్మనండి మాట్లాడదాం’ అన్నారట. సభకు సహకరిస్తారా లేదా అంటూ అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు.
టీడీపీ సభ్యుల తీరుపై బీఏసీలో మంత్రుల అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చకు సహకరించకుండా గొడవ చెయ్యడం కరెక్ట్‌ కాదని మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ముఖ్యమంత్రిని అంటే ఊరుకునేది లేదని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, జోగి రమేష్‌ అన్నారు. సభలో గౌరవంగా ఉండాలని.. కానీ సభ ప్రారంభమైన దగ్గర నుంచి అడ్డుకోవడం సరికాదన్నారు. మరోవైపు సభను ఐదు రోజుల పాటూ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 వరకు సభ కొనసాగనుంది.. శని, ఆదివారాలు సెలవు దినాలు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img