పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
దేశంలోని ప్రస్తుత పరిస్థితి ఎంతమాత్రం బాగోలేదని, ఒంటరి రాజకీయాలే ఇందుకు కారణమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్కతాలోని రైన్-డ్రెంచ్డ్ రెడ్ రోడ్లో మంగళవారం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా జరిగిన పార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలెవరూ భయపడవద్దని, మంచి భవిష్యత్తు కోసం అంతా కలిసికట్టుగా ఉండాలని కోరారు. ‘’దేశంలో ప్రస్తుత పరిస్థితి ఏమీ బాగోలేదు. విభజించి పాలించే విధానాలు.. ఒంటరి రాజకీయాలు ఏమాత్రం సరికాదు. భయపడొద్దు…కలిసికట్టుగా పోరాడుదాం’’అని సీఎం అన్నారు. తాను కానీ, తన పార్టీ కానీ, ప్రభుత్వం కానీ ప్రజలకు కష్టం కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టదని భరోసా ఇచ్చారు.