Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

ఫైనల్‌కు చేరిన రెజ్లర్‌ రవి కుమార్‌
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. భారత రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా రెజ్లింగ్‌ విభాగంలో ఫైనల్‌కు చేరాడు. ఇవాళ 57 కేజీల విభాగంలో సెమీస్‌కు చేరి పతకంపై ఆశలు పెంచిన రవి కజకిస్తాన్‌ రెజ్లర్‌ సనయొవ్‌పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ ఆఖరి పోరులో గెలిస్తే భారత్‌కు స్వర్ణ పతకం దక్కనుండగా ఓడితే రజతం ఖాయం కానుంది. ఇక ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ పురుషుల విభాగంలో పతకం తీసుకొచ్చిన మూడో రెజ్లర్‌గా రవికుమార్‌ నిలవనున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img