Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఓడిపోతామని తెలిస్తే చాలు.. బీజేపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుంది…: కేజ్రీవాల్‌

ప్రధాని నరేంద్ర మోదీపై ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీరు భయపెడితే భయపడటానికి కాంగ్రెస్‌ నాయకులం కాదు.. మేం సర్దార్‌ వల్లభాయ్‌ పటేళ్లం.. భగత్‌ సింగ్‌లం.. భయపడం.. పోరాడుతామని కేజ్రీవాల్‌ తేల్చిచెప్పారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మీడియాతో కేజ్రీవాల్‌ మాట్లాడారు. ఓడిపోతామని తెలిస్తే చాలు బీజేపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఆప్‌ నాయకుడు మనోజ్‌ సోరథియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మనోజ్‌పై బీజేపీ గుండాలు దాడి చేయడంతో.. గుజరాత్‌లోని ఆరు కోట్ల మంది ప్రజలు మోదీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఓ నాయకుడిపై దాడి చేయడం ఈ దేశం సంస్కృతి కాదు. అంతకంటే హిందూ సంస్కృతి కాదు. అసలు గుజరాత్‌ కల్చర్‌ కానే కాదన్నారు. మనోజ్‌పై దాడి చేయడాన్ని సూరత్‌ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కేజ్రీవాల్‌ తెలిపారు. సూరత్‌లో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో ఆప్‌ 7 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. గుజరాత్‌లో ఆప్‌ విజయం సాధించడం ఖాయమని కేజ్రీవాల్‌ ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img