కర్నాల్లో భారీ ప్రదర్శన
అడుగడుగునా అడ్డంకులు
పోలీసులతో వాగ్వాదం
హరియాణాలో ఉద్రిక్తత
కర్నాల్ : రైతు వ్యతిరేక సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హరియాణాలోని కర్నాల్ జిల్లాలో మంగళవారం అన్నదాతలు కదం తొక్కారు. సెక్రటేరియట్ ముట్టడికి రైతులు తీవ్రంగా ప్రయత్నించారు. జిల్లా అధికారులతో చర్చలు విఫలం కావడంతో సాయంత్రం యూనియన్ నేతల సారథó్యంలో వేలాది మంది జిల్లా కేంద్రకార్యాలయానికి ప్రదర్శన నిర్వహించారు. ఆగస్టు 28న కర్నాల్లో రైతు నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన రైతు సంఘాలు… సంబంధిత అధికారులపై చర్యలకు ముక్తకంఠంతో డిమాండు చేశారు. లేనిపక్షంలో కర్నాల్ మినీ సెక్రటేరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్లకు అధికారులు అంగీకరించలేదని సమావేశం జరిగిన మూడు గంటల తర్వాత రైతు నేత జోగిందర్ సింగ్ ఉగ్రహన్ తెలిపారు. 11 మందితో కూడిన రైతు ప్రతినిధుల బృందం చర్చల్లో పాల్గొన్నట్లు వెల్లడిరచారు. మహాపంచాయత్కు వచ్చిన వారంతా శాంతియుతంగా ఐదు కి.మీల దూరంలో గల సెక్రటేరియట్కు మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. పోలీసులతో వాగ్వాదానికి దిగొద్దని సూచించారు. రైతు యూనియన్ జెండాలు చేబూని వేలాది మంది నిరసనకారులు ముందుకు సాగారు. మార్గమధ్యలో అనేకచోట్ల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు బీకేయూ నేత రాకేశ్ తికైత్ విలేకరులతో మాట్లాడారు. నిరసన చేసిన రైతుల తలలు పగలగొట్టాలని పిలుపునిచ్చిన ఐఏఎస్ను సస్పెండ్ చేయాలని డిమాండు చేశారు.
భద్రతా వలయంలో కర్నాల్ హరియాణాలోని కర్నాల్లో మంగళవారం కిసాన్ మహాపంచాయత్కు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. ఆగస్టు 28న లాఠీచార్జికి నిరసనగా మినీ సెక్రటేరియట్ ఘెరావ్కు రైతులు నడుం బిగించగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో 11 మంది రైతుల బృందంతో అధికారులు చర్చలు జరుపుగా అవి అసంతృప్తిగా ముగిసినట్లు రైతు నేతలు తెలిపారు. బీకేయూ నేత రాకేశ్ తికైత్తో పాటు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సీనియర్ నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, దర్శన్ పాల్, యోగేంద్ర యాదవ్, గుర్నామ్ సింగ్ చౌధునిలు మహా పంచాయత్లో పాల్గొన్నారు. ఆగస్టు 28న రైతులపై పోలీసుల లాఠీచార్జిని ఖండిరచారు. కారకులపై చర్చలు తీసుకోవాలని డిమాండు చేశారు. జిల్లా అధికారులతో చర్చల్లోనూ రైతు నేతలు పాల్గొని వేర్వేరు అంశాలపై చర్చించారు. ఇదే విషయాన్ని కర్నాల్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ యాదవ్ పీటీఐకి ఫోన్ ద్వారా వెల్లడిరచారు. సెక్రటేరియట్ ఘెరావ్కు రైతులు సిద్ధం కాగా కర్నాల్లో పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు. కేంద్ర బలగాలనూ రంగంలోకి దించారు. న్యూ అనాజ్ మండీలో రైతుల మహా పంచాయత్ నిర్వహించడంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారని అధికారులు తెలిపారు. దిల్లీకర్నాల్
అంబాలా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు మాత్రం అంతరాయం కలగలేదన్నారు. శాంతియుతంగా సమావేశమవుదామని అందరూ అనాజ్ మండీకి చేరుకోవాలని రైతులకు బీకేయూ (చౌదుని) హరియాణా అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చౌదుని ఇంతకుముందే పిలుపునిచ్చారు. ఈ మహా పంచాయత్లో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని వీడియో సందేశంలో వెల్లడిరచారు. అయితే కొందరు లాఠీలు, ఇనుప రాడ్లతో అనాజ్ మండీకి చేరుకున్నట్లు హరియాణా పోలీసులు, కర్నాల్ జిల్లా యంత్రాంగం ప్రకటనలు వెలువరించాయి. దురుద్దేశంతో వచ్చిన వారిని వెనక్కి పంపాలని రైతు నేతలతో చర్చించగా వారు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆ వ్యక్తులు వినలేదని పోలీసులు, జిల్లా యంత్రాంగం చేసిన ప్రకటనలు పేర్కొన్నాయి. మినీ సెక్రటేరియట్ వద్ద పహారా పెంచి భారీగా బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. మినీ సెక్రటేరియట్ ఘెరావ్కు రైతులు పిలుపునివ్వడంతో కేంద్ర భద్రతా బలగాలను జిల్లాలో మోహరించడమే కాకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, ప్రజలు గుమ్మిగూడకుండా నిషేధాజ్ఞలను అధికారులు జారీచేశారు. సోమవారం 12.30 గంటల నుంచి మంగళవారం అర్థరాత్రి వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను కురుక్షేత్ర, కైథల్, జింద్, పానిపట్ జిల్లాల్లో నిషేధించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల 10 కంపెనీలతో పాటు 40 భద్రతా బలగాల కంపెనీలతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. కర్నాల్ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. చౌదుని మాట్లాడుతూ, సోమవారం జిల్లా అధికారులతో చర్చలు అసంతృప్తిగా ముగియడంతో మంగళవారం మహా పంచాయత్కు శ్రీకారం చుట్టినట్లు వెల్లడిరచారు. ఆగస్టు 28న రైతులపై లాఠీచార్జ్ చేసిన వారిపై కేసు పెట్టాలని, లాఠీ దెబ్బలకు ప్రాణాలు విడిచిన రైతు కుటుంబానికి రూ.25 లక్షల చొప్పుణ నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండు చేశారు. అయితే రైతు మృతికి గుండెపోటు కారణమని పోలీసుల లాఠీలు కాదంటూ జిల్లా యంత్రాంగం సమర్థించుకుంది.