Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కరోనా..ఇంకా సమసిపోలేదు : డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా మహమ్మారి ఇంకా సమసిపోలేదని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనం గెబ్రియసస్‌ హెచ్చరించారు. ఒక్కో దేశం ఒక్కో రకమైన సవాళ్లను, సంక్లిష్ట పరిస్ధితిని ఎదుర్కొంటోందని అన్నారు. పలు దేశాల్లో టెస్టింగ్‌ ఆశించిన రీతిలో జరగకపోవడం వల్లే గత కొద్దివారాలుగా కేసులు తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.దక్షిణకొరియాలో గురువారం 6.2 లక్షల కేసులు వెలుగుచూశాయి. జర్మనీ, వియత్నాం, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ , చైనాలోనూ పెద్దసంఖ్యలో నమోదవుతుండటం కలకలం రేపుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img