Friday, April 19, 2024
Friday, April 19, 2024

కరోనా విషయంలో అబద్దపు ప్రచారాలు చేయొద్దు..చైనా శాస్త్రవేత్తలను కోరిన డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌

గత మూడేళ్లుగా కరోనా వైరస్‌ విషయంలో ప్రపంచం అతలాకుతలం అవుతోందని ..వైరస్‌ విషయంలో అబద్ధాలను ప్రచారం చేయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అథనామ్‌ ఘేబ్రియేసస్‌ మరోమారు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు చైనా ఉన్నతాధికారులతో కూడిన ప్రతినిధి బృందంతో ఘేబ్రియేసస్‌ తాజాగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైనాలో ప్రస్తుత పరిస్థితిని ప్రపంచానికి వెల్లడిరచాలని ఆయన కోరారు. వైరస్‌ వ్యాప్తికి సంబంధించిన వివరాలు, జెనెటిక్‌ సీక్వెన్సింగ్‌, కరోనాతో ఆసుపత్రులకు చేరిన వాళ్ల సంఖ్య, ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న వాళ్లు ఎంతమంది, కరోనా మరణాలు, వ్యాక్సినేషన్‌ లెక్కలు.. తదితర వివరాలను ప్రపంచానికి వెల్లడిరచాలని ఘేబ్రియేసస్‌ కోరారు.ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో వైరస్‌ వేరియంట్ల పరిశీలన, వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న చికిత్స, వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడిరచాలని చెప్పారు.కరోనాకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో కలిసి పనిచేయాలంటూ చైనా శాస్త్రవేత్తలకు ఘేబ్రియేసస్‌ పిలుపునిచ్చారు. వైరల్‌ సీక్వెన్సింగ్‌ పై జనవరి 3న నిర్వహించబోయే సమావేశంలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img