పుస్తకావిష్కరణలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
నాటి కళాకారులు, కవులు, మేధావుల త్యాగాలు నేటితరం కళాకారులకు స్ఫూర్తిదాయకం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి గౌరవ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు అక్షరాకృతి కల్పించిన ‘నాలుగు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి పుస్తకావిష్కరణ`పరిచయం’ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు గని అధ్యక్షతన ఘనంగా జరిగింది.
గుంటూరు వైద్యం : నాటి కళా కారులు, కవులు, మేధావుల త్యాగాలు నేటితరం కళాకారులకు స్ఫూర్తిదాయం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు అక్షరా కృతి కల్పించిన ‘నాలుగు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి పుస్తకావిష్కరణ
పరిచయం’ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు గని అధ్యక్షతన ఘనంగా జరి గింది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు రామకృష్ణతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. రామకృష్ణ మాట్లా డుతూ స్వాతంత్య్ర పోరాటంలో, భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి సేవలు ఎనలేనివని కొనియాడారు. సుదీర్ఘ చరిత్ర, చారిత్రక నేపథ్యం గల కీలక పోరాటాల్లో భాగస్వామి అయిన ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి మసకార డానికి కళాకారులే కారణమన్నారు. నల్లూరి జీవితమే ప్రజానాట్యమండలి అని, ప్రజానాట్య మండలే నల్లూరి వెంకటేశ్వర్లు అని రామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిని పునరుద్ధరణ చేసి… రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోరాటాలను పుస్తక రూపంలో తీసుకురావడం నల్లూరి వెంక టేశ్వర్లుకే సాధ్యమని కొనియాడారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి చరిత్రను గ్రంధస్తం చేయాలన్న సంకల్పం నల్లూరి వెంకటే శ్వర్లు మదిలో పుట్టుకురావడం గొప్ప విషయ మన్నారు. పుస్తకం రాయాలన్నా, సంకలనం చేయా లన్నా, వ్యాసాలను, కథలను సంకలనం చేయాలన్నా అంత సులువేమీ కాదన్నారు. మూడు దశాబ్దాల నాటి సంఘటనలను, విశిష్ట తలను, ఆనాటి చరిత్రను సేకరించడం కష్టమే నన్నారు. నల్లూరి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షులుగా, అధ్యక్షు లుగా, ప్రధాన కార్యదర్శిగా ఎందరో నటులను, గాయకులను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసిం చారు. ప్రజా కళలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలికి, సాహిత్య, సాంస్కృతిక రంగానికి నల్లూరి వెంకటేశ్వర్లు చేసిన సేవలు ప్రభుత్వాలు, విశ్వ విద్యాలయాలు గుర్తించి అవార్డు ఇచ్చాయని గుర్తు చేశారు. గని మాట్లాడుతూ నైతిక విలువలు, మానవ సంబంధాలు ప్రమాదకరంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి పాత్ర మరింత కీలకం కావాలని ఆకాంక్షించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ మాట్లాడుతూ ప్రజా నాట్యమండలి అంటే ప్రతి గుండె ప్రతిధ్వని అని అన్నారు. అనేక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడి కొవ్వొత్తిలా కరిగిపోతూ సమాజానికి వెలుగు నిస్తున్న కళాకారులను గుర్తు చేసుకున్నారు. తాను సీపీఐ జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదగటానికి ప్రజానాట్యమండలియే కారణమని సగర్వంగా వెల్లడిరచారు. అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నల్లూరి వెంకటేశ్వర్లును ప్రతి కళాకారుడు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు నాయుడు గోపి మాట్లాడుతూ కొన్నివేల మంది కళాకారులు నల్లూరి వెంకటేశ్వర్లు నీడన ఎదిగారన్నారు. నల్లూరి ఆశయాలు, స్ఫూర్తితోనే 37 సంవత్సరాలుగా నాటకరంగంలో మనగలు గుతు న్నట్లు ఆయన చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కార ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ముందుకు సాగుతుందన్నారు. 19742014 నాలుగు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి పుస్తకావి ష్కరణ
పరిచయాన్ని నాటక రంగం పరిశోధ కులు కందిమళ్ల సాంబశివరావు పరిచయం చేశారు. ఈ దేశంలో, రాష్ట్రంలో 75సంవత్స రాలుగా చేసిన పోరాటాలను నల్లూరి వెంకటే శ్వర్లు పుస్తకంలో పొందు పరిచినట్లు తెలిపారు. ప్రముఖ రచయిత, నటులు వరికూటి శివప్రసాద్ మాట్లాడుతూ ప్రజానాట్యమండలి ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం పుట్టిందన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ఎంతో కీలకపాత్ర పోషిందన్నారు. పుస్తకావిష్కరణకు ముందు ప్రజా నాట్యమండలి, గుంటూరు కళాపరిషత్ కళాకా రులు అనేక గేయాలు ఆలపించి కళాకారులలో ఉత్పాహాన్ని నింపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలికి విశేష సేవలందించిన సీనియర్ కళాకారులు బొడ్డు బుల్లెబ్బాయి (రాజమండ్రి), పులి సాంబశివరావు (గుంటూరు), పోలవరపు సీతారామయ్య (ఒంగోలు), సబ్బి కనకారావు (ఏలూరు, పశ్చిమ గోదావరి), గొఱ్ఱెల రాము, లింగమూర్తి (కడప), బొల్లిముంత కృష్ణ (తెనాలి), ఆర్.పిచ్చయ్య (విజయవాడ), పీసీ కుళ్లాయప్ప (గుంతకల్, అనంతరం జిల్లా), షేక్ షరీఫ్ (వేటపాలెం, చీరాల), సీహెచ్ కృష్ణ (గుంటూరు), నంబూద్రి (శ్రీకాకుళం), ప్రముఖ రంగస్థల నటి, గాయని ఉమ (రాజమండ్రి)ను రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వర రావు, నల్లూరి వెంకటేశ్వర్లు దుశాలువా, మొమెంటోలతో ఘనంగా సత్కరించారు. నల్లూరి వెంకటే శ్వర్లును రామకృష్ణ, ముప్పాళ్ల ప్రత్యేకంగా దుశ్శాలువా, మొమెంటోతో సత్కరిం చారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్య దర్శి చంద్రానాయక్, గుంటూరు కళాపరిషత్ కార్య దర్శి బండ్ల పూర్ణ, ఎన్టీఆర్ కళాపరిషత్ కార్యదర్శి కాట్రగడ్డ రామకృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సీపీఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, ఏఐటీయూసీ నగర కార్య దర్శి రావుల అంజిబాబు, రామారావు పాల్గొన్నారు.