Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కాంగ్రెస్‌కు పీకేలాంటి వాళ్ల అవసరం లేదు.. : ప్రశాంత్‌ కిషోర్‌

కాంగ్రెస్‌కు తాను చెప్పాలనుకున్నది చెప్పానని స్పష్టీకరణ
కాంగ్రెస్‌ పార్టీకి తానిచ్చిన లీడర్‌షిప్‌ ఫార్ములాలో రాహుల్‌ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ పేర్లు కానీ లేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తెలిపారు. అయితే, ఈ విషయంలో మరి మూడోపేరు ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు.. దానిగురించి ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. ‘ఆజ్‌తక్‌’ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీకి పీకే లాంటి వాళ్ల అవసరం లేదని, ఆ పార్టీ నిర్ణయాలను తీసుకోగలదని అన్నారు. మీడియా తనను అవసరానికి మించి పెద్దగా చూపిస్తోందనాన్నరు. తన స్థాయి అంత పెద్దది కాదని, రాహుల్‌ గాంధీ తనపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని ప్రశాంత్‌ కిషోర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు తాను చెప్పాలనుకున్నది చెప్పానని, అలా ముందుకెళ్లాలా? వద్దా? అనేది వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పీకే వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img