కాంగ్రెస్లో అంతర్గత సవాళ్ళు పెచ్చుమీరాయని టీఎంసీ విమర్శించింది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఆరోపించింది.జాతీయ స్ధాయిలో కూటమి ఏర్పాటుకు చొరవ చూపని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్కే పరిమితమైందని దుయ్యబట్టింది. కాంగ్రెస్ పార్టీ కేవలం ట్వీట్లతోనే కాలం గడుపుతోందని పార్టీ పత్రిక జాగో బంగ్లాలో టీఎంసీ రాసుకొచ్చింది.ఎన్నికల్లో చతికిలపడి, అంతర్గత పోరుతో సతమతమవుతూ మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని స్థితిలో ఉందని పేర్కొంది. బీజేపీని ఎలా మట్టికరిపించాలో బెంగాల్ ఎన్నికల్లో తాము ఓ దారి చూపించామని టీఎంసీ పేర్కొంది.