Friday, April 19, 2024
Friday, April 19, 2024

కాంగ్రెస్‌ సంక్షోభానికి పార్టీ అగ్రనాయకత్వ వైఖరే కారణం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీష్‌ తివారీ
ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చీఫ్‌ హరీష్‌ రావత్‌ ట్వీట్‌ పార్టీలో దుమారం రేపిన నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీష్‌ తివారీ కాంగ్రెస్‌ అగ్రనాయకత్వాన్ని తప్పుపట్టారు.అసోం, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ సంక్షోభానికి పార్టీ అగ్రనాయకత్వ వైఖరే కారణమని మండిపడ్డారు. అసోం, పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల ఎదుర్కొన్న సంక్షోభంతో ఉత్తరాఖండ్‌ పరిణామాలను పోల్చారు. అసోం సీఎం హిమంత్‌ బిశ్వ శర్మ 2014 జులైలో అప్పటి సీఎం తరుణ్‌ గగోయ్‌తో పాటు పార్టీ నాయకత్వంతో విభేదించి కాషాయ పార్టీలో చేరారు. తనకు 52 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శర్మ ప్రకటించినా సీఎంను చేసేందుకు రాహుల్‌ గాంధీ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్‌ను వీడారు. ఇక పంజాబ్‌ సీఎంగా పనిచేసిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూతో విభేదాలతో ఆ పార్టీని వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేసి బీజేపీతో జట్టు కట్టారు.పార్టీ సీనియర్‌ నేతల నడుమ తలెత్తే విభేదాలు బహిర్గతమైనా వాటిని పరిష్కరించడంలో అగ్రనాయకత్వం విఫలమవడంతోనే ఆయా నేతలు కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్టు కనిపిస్తోందని మనీష్‌ తివారీ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img