కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి కరోనా బారినపడ్డారు. గురువారం వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె ఐసోలేషన్లోకి వెల్లారు. ఇదిలాఉండగా నేషనల్ హెరాల్డ్ కేసులో సమన్లు జారీ కావడంతో ఈడీ విచారణకు జూన్ 8న సోనియా గాంధీ హాజరుకావాల్సి ఉండగా.. కరోనా సోకడం గమనార్హం.ఇక ఇటీవల సోనియాతో సమావేశమైన నేతలకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది.