Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మరి కేంద్రం అప్పుల సంగతేంటి?

కేంద్రం కంటే మెరుగ్గా ఏపీ ఆర్థిక పరిస్థితి
కావాలనే ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం : ఎంపీ విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని, వైఎస్‌ జగన్‌ లాంటి సమర్థ నాయకత్వం చేతిలో ప్రభుత్వం పని చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కావాలనే ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.అసలు రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు గురువారం న్యూఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఒకరకంగా కేంద్రం కంటే ఏపీ పరిస్థితినే ఆర్థికంగా మెరుగ్గా ఉంది. 2021-22 సంవత్సరంలో కేంద్రం జీడీపీ 57 శాతంగా ఉంది. ఏపీ జీడీపీ ఐదో స్థానంలో ఉంది. ఎగుమతుల్లోనూ ఏపీ ఎంతో అభివృద్ధి సాధించింది. కానీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిందన్నారు. కేంద్రానికి పన్నుల ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు మాత్రం సరైన వాటా ఇవ్వడం లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. 41 శాతం పన్నుల వాటా కేంద్రం ఇస్తున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సెస్‌, సర్‌ఛార్జీలు కేంద్రం ఏటా పెంచుతోంది. కానీ, ఆ ఆదాయం మాత్రం కేంద్రం పంచడం లేదన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఆత్మపరిశీలన చేసుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు. రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడుతున్న కేంద్రం.. తన అప్పుల సంగతిపై ఏం చెబుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 2014-19లో కేంద్రం అప్పులు 60 శాతం పెరిగితే , చంద్రబాబు హాయంలో రాష్ట్రంలో 117 శాతం అప్పులు పెరిగాయి. కేంద్రం 2019 నుంచి ఇప్పటి వరకు 50 శాతం అప్పులు చేస్తే, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం హయాంలో కేవలం 43 శాతం అప్పులు మాత్రమే పెరిగాయన్నారు. నాటి చంద్ర బాబు ప్రభుత్వం అయిదుగురు కోసం పని చేస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అయిదు కోట్ల మంది ప్రజల అభివృద్ధికి పని చేస్తుంది అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.కేంద్ర నుంచి నిధులు రాబట్టడంలో తాము విజయవంతం అయ్యామని మరో ఎంపీ మిధున్‌ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారులకు ఏ రాష్ట్రానికీ రానన్ని నిధులు ఏపీకి వచ్చాయన్నారు. ఉపాధి హామీ పథకం కింద నిధులు తీసుకు రావడంలో ఎంపీలందరం సమిష్టిగా పని చేస్తున్నామన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ వాటర్‌ గ్రిడ్‌ పథకం కింద రాష్ట్రంలో సురక్షిత జలాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img