కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడిరచారు. తనకు కొవిడ్-19 టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్గా వచ్చిందని, ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నాను అని ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, కరోనా నివారణ నియమాలను అనుసరించండి అని ఆమె ట్విట్టర్లో కోరారు.దేశంలో గత 24 గంటల్లో గురువారం 90,928 కొత్త కొవిడ్-19 కేసులు, 325 మరణాలు సంభవించాయి.దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,82,876 కు చేరుకుంది.