Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కేంద్ర భారీ వడ్డనలపై మండిపడ్డ రాహుల్‌, పలువురు నేతలు

ఎన్నికల ప్రక్రియ ముగిసి ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే కేంద్రం అమాంతం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను భారీగా పెంచడంపై పలువురు కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ చర్యపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌పై విధించిన లాక్‌డౌన్‌ ఎత్తేశారు’’ అంటూ ట్వీట్‌ చేశారు. కరోనా మహమ్మారి సమయంలో మోదీ ఏం చెప్పారో అదే చేశారని పేర్కొంటూ..’థాలి బజావో’ (ప్లేటు వాయించడం) అంటూ ఆ ట్వీట్‌ యాష్‌ట్యాగ్‌ ఇచ్చారు. . దాదాపు 137 రోజుల తర్వాత మంగళవారంనాడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటరుకు 80 పైసలు చొప్పున చమురుసంస్థలు పెంచాయి. ఎల్‌పీజీ గ్యాస్‌ ధరను రూ.50 పెంచారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంధనం ధరలు అమాంతం పెంచేస్తారని తాము ముందే చెప్పామని, అదే నిజమైందని అధీర్‌ రంజన్‌ చౌదరి అన్నారు. పేద ప్రజలను కొల్లగొట్టేందుకు మోదీ ఎప్పుడూ వెనుకాడరని, సామాన్య ప్రజల తరఫున తాము లోక్‌సభ వెలుపల, లోపల కూడా పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పారు. ఇంధనం ధరలను పెంచడం ద్వారా పేద ప్రజల నుంచి మోదీ రూ.10,000 కోట్లు కొల్లగొట్టారని రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఉక్రేయిన్‌, రష్యా సంక్షోభం వల్ల ధరలు పెరిగి, పెట్రోలియం కనిష్ట స్థాయిలో ఉంటుందని చాలా మంది చెబుతూ వచ్చారని, మనం ఒక్క శాతం క్రూడాయిల్‌ కూడా రష్యా నుంచి కొనుగోలు చేయలేదని ఆయన అన్నారు. కాగా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల తర్వాత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అసాధారణంగా కేంద్రం ధరలు పెంచేస్తుందని అఖిలేష్‌ యాదవ్‌ తన ప్రసంగంలో పదేపదే ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారని, అదే ఇప్పుడు జరిగిందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img