కేంద్రాన్ని కోరిన విజయన్ ప్రభుత్వం
ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో చిక్కుకున్న 36 మంది కేరళవాసులను సురక్షితంగా భారత్కు తీసుకురావాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తమ రాష్ట్రంలోని ఎన్ఆర్ఐ సంస్థకు కాబూల్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఆ నగరంలో 36 మంది కేరళీయులు చిక్కుకున్నట్లు తెలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగశాఖకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖను కూడా సమర్పించింది.