దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,134 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,95,958కు పెరిగింది.కొత్తగా 36,946 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 422 మంది కరోనా బారినపడి మృతిచెందారు. మొత్తం 3,08,57,467 మంది బాధితులు కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 4,24,773 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 4,13,718 యాక్టివ్ కేసులున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 47,22,23,639 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా, ఇప్పటివరకు దేశంలో 70 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.