సెప్టెంబర్ నాటికి పిల్లలకు కొవిడ్ టీకా
: ఎయిమ్స్ చీఫ్ గులేరియా
కరోనా మహమ్మారిలో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశమున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేలా మనకు బూస్టర్ డోసుల అవసరముందని ఎయిమ్స్ చీఫ్ డా.రణదీప్ గులేరియా అభిప్రాయం వ్యక్తంచేశారు. కొవిడ్ కారణంగా చాలామందిలో రోగనిరోధకశక్తి క్షీణిస్తున్న సమయంలో కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే బూస్టర్ డోసులపై ప్రయోగాలు కొనసాగుతున్నాయని, ఈ ఏడాది చివరినాటికి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశముందన్నారు.
సెప్టెంబర్ నాటికి పిల్లలకు కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడిరచారు. పిల్లలకు కొవిడ్ టీకా వేయడం వల్ల కరోనా ప్రసార చైన్ సిస్టమ్ను విచ్ఛిన్నం చేసేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. జైడస్ ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ చేసిందని, అత్యవసర అనుమతి కోసం జైడస్ వ్యాక్సిన్ కంపెనీ ఎదురుచూస్తుందని తెలిపారు. కొవాగ్జిన్ ట్రయల్స్ ఆగస్టు, సెప్టెంబరు నాటికి పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. ఫైజర్ వ్యాక్సిన్ ఇప్పటికే ఎఫ్డీఏ ఆమోదం పొందిందని తెలిపారు. కొవిడ్ టీకా పరీక్షల కోసం జూన్ 7 న దిల్లీ ఎయిమ్స్ 2 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పిల్లలను పరీక్షించడం ప్రారంభించింది. మే 12 న, రెండు సంవత్సరాల వయస్సులోపు పిల్లలపై కొవాగ్జిన్్ రెండో దశ, మూడో దశ పరీక్షలను నిర్వహించడానికి డిసిజిఐ భారత్ బయోటెక్ అనుమతి ఇచ్చింది. పిల్లలను వారి వయస్సు ప్రకారం వర్గాలుగా విభజించడం ద్వారా ఈ విచారణ జరుగుతుంది.