Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

కొవిడ్‌ పరిహార చెల్లింపుల్లో జాప్యం..

ఏపీ, బీహార్‌ ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్‌
ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు సమన్లు

కొవిడ్‌ పరిహార చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.ఏపీ, బీహార్‌ రాష్ట్రాలపై అత్యున్నత న్యాయస్థానం అసహనం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు హాజరుకావాలంటూ ఆదేశాలిచ్చింది. కరోనా కారణంగా మరణించినవారి కుటుంబానికి రూ. 50 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని గతంలో న్యాయస్థానం ఆదేశించింది. అలాగే కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. అయితే ఈ చెల్లింపుల విషయంలో ఏపీ, బీహార్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యం వహించాయి. దీనిపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏపీ, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు ముందు హాజరుకావాలని, పరిహారం ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img