Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కొవిడ్‌ బారినపడితే..కోలుకున్నాక మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్‌ డోస్‌

రాష్ట్రాలకు కేంద్రం కీలక లేఖ..!
కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు తాజాగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. కరోనా మహమ్మారి బారిన పడిన వారికి ..దాని నుంచి కోలుకున్న నాటి నుంచి మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్‌ డోసు వేయాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో తెలిపింది. ఈ విషయాన్నే సంబంధిత అధికారులకు తెలియజేయలని సూచించింది. కొవిడ్‌ బారినపడి వారికి సాధారణ డోసులు సహా ప్రికాషన్‌ డోసు వేసే విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలంటూ వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో ఈ సూచనలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి వికాశ్‌ షీల్‌ తెలిపారు. ‘‘దయచేసి గమనించండి. ల్యాబ్‌ పరీక్షల ద్వారా కరోనా సోకినట్లు నిర్ధారించబడిన వారికి,సార్స్‌`2, కొవిడ్‌-19 నుండి కోలుకున్న తర్వాత, ప్రికాషన్‌ డోస్‌ సహా అన్ని రకాల కోవిడ్‌ టీకాలు తదుపరి 3 నెలల పాటు నిలిపివేయబడతాయి.’’ అని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఇచ్చిన సూచనల మేరకు ఈ మార్గదర్శకాలు వెలువరిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తన లేఖలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img