Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

కొవిడ్‌ బారిన చిన్నారులు

లూథియానా, బెంగళూరులో కరోనా కలకలం
పంజాబ్‌లోని లూథియానాలో కొవిడ్‌ కలకలం రేపింది. స్కూళ్ళు తెరిచిన వారం రోజులకే 20 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్‌ నిర్థారణయ్యింది. రెండు స్కూళ్లలోని విద్యార్థులు ఈ వైరస్‌ కి గురయ్యారని డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 2 నుంచి పాఠశాలలను తెరిచారు. కాగా కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో గత ఐదు రోజుల వ్యవధిలో 242 మంది చిన్నారులకు కొవిడ్‌ పాజిటివ్‌ సోకింది. వీరిలో తొమ్మిదేళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా, 9 నుంచి 19 ఏళ్లలోపు వారు 136 మంది ఉన్నారు. బీబీఎంపీ ఈ మేరకు వివరాలు వెల్లడిరచింది. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ వస్తే చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని భావిస్తున్న తరుణంలో చిన్నారులు కొవిడ్‌ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img