మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి సిబిఐ కోర్టులో లొంగిపోయారుౌ ప్రస్తుతం ఆయన డిఫాల్ట్ బెయిల్పై బయట ఉన్నారు. కాగా గంగిరెడ్డి బెయిల్ను ఇటీవల తెలంగాణా హైకోర్టు రద్దు చేసిన నేపధ్యంలో కోర్టు ఆదేశాలతో ఈనెల 5వ తేదీ శుక్రవారం కోర్టులో లొంగిపోవాలి ్స ఉంది. లేకుంటే అరెస్టు చేయాలని కోర్టు సీబిఐని ఆదేశించింది. ఈ నేపధ్యంలో వివేకా కేసులో కీలకమైన మొదటి నిందితునిగా ఉన్న గంగిరెడ్డి నేడు సిబిఐ కోర్టుకి వచ్చారు.. హైకోర్టు ఆదేశాలతో తాను లొంగిపోతున్నట్లు గంగిరెడ్డి ప్రకటించారు.. ఇక నుంచి జ్యుడీషియల్ రిమాండులోకి వెళ్ళనున్నారు.