దేశవ్యాప్తంగా గడువులోగా కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకోలేకపోయిన వారి సంఖ్య 3.86 కోట్ల మంది పైమాటేనని కేంద్రం పేర్కొంది. దీనికి సంబంధించి దాఖలైన ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్రం సమాధానమిచ్చింది. రమణ్శర్మ అనే వ్యక్తి స.హ. చట్టం కింద కొవిడ్ వ్యాక్సినేషన్కు సంబంధించి గడువులోగా రెండో డోసు వేసుకోలేకపోయిన వారి వివరాలను కోరగా..ఆగస్టు 17 నాటికి ఉన్న వివరాలను కేంద్రం వెల్లడిరచింది.కొవిషీల్డ్ టీకా తొలిడోసు తీసుకున్న 3,40,72,993 మంది, కోవాగ్జిన్ టీకా తొలి డోసు తీసుకున్న 46,78,406 మంది గడువులోగా రెండో డోసు వేసుకోలేపోయారని కేంద్రం వెల్లడిరచింది.