Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌..

26 మంది మావోయిస్టులు హతం
గ్యారబట్టిలో ఎదురుకాల్పులు

విశాలాంధ్ర చింతూరు : మహారాష్ట్రలోని గడ్చిరోలిలో శనివారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ముంబైకి 900 కిమీల దూరంలో ఉన్న గడ్చిరోలి జిల్లాలో జరిపిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులను పోలీసులు హతమార్చినట్లు సీనియర్‌ అధికారులు తెలిపారు. 26 మృతదేహాలను ఎన్‌కౌంటర్‌ స్థలి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఎస్పీ అంకిత్‌ గోయల్‌ వెల్లడిరచారు. మార్డింటోలా అటవీ ప్రాంతంలోని కోర్చిలో ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. అదనపు ఎస్పీ సౌమ్య ముండె నేతృత్వంలో సి60 పోలీసు కమాండో బృందం సర్చ్‌ ఆపరేషన్‌ జరిగిందని గోయల్‌ తెలిపారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని, హతమైన మావోయిస్టుల్లో టాప్‌ రెబల్‌ నేత
ఉన్నట్లు అనుమానం వ్యక్తంచేశారు. నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడగా వారిని వైద్యం కోసం హెలికాప్టర్‌లో నాగపూర్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడిరచారు. సీఆర్పీఎఫ్‌, మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img