దేశంలో కొత్తగా 1,778 పాజిటివ్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి ఆందోళనకు గురిచేస్తుంటే..భారత్లో మాత్రం సానుకూల వాతావరణం కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖంపట్టాయి. రెండువేలకు దిగువనే కేసులు నమోదవుతుండటం కాస్త ఊరటనిస్తున్నాయి. తాజాగా దేశంలో 1,778 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,12,749కి చేరాయి. ఇందులో 4,24,73,057 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,16,605 మంది మరణించగా, 23,087 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో 2542 మంది కరోనా నుంచి బయటపడగా, 62 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇక ప్పటివరకు 1,81,89,15,234 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. అయితే గత రెండు రోజులుగా కరోనా రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 1581 కేసులు నమోదవగా, తాజాగా అవి 1778కి పెరిగాయి.