Friday, April 19, 2024
Friday, April 19, 2024

గుంటూరులో మంకీపాక్స్‌ కలకలం.. ఎనిమిదేళ్ల బాలుడికి లక్షణాలు!

గుంటూరులో మంకీపాక్స్‌ అనుమానిత కేసు కలకలం రేపింది. ఓ ఎనిమిదేళ్ల బాలుడి ఒంటిపై దద్దుర్లు కనిపించటంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. బాలుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించారు. మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించటం వల్ల బాలుడి శాంపిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి పంపించారు. రెండు వారాల క్రితమే జీజీహెచ్‌కు బాలుడిని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. బాలుడి తల్లిదండ్రులు ఒడిశాకి చెందినవారు కాగా.. ఉపాధి కోసం పల్నాడుకి వచ్చారు. రిపోర్ట్‌ రాగానే తేలుతుందంటున్నారు.. దాన్ని బట్టి తదుపరి కార్యచరణ ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. ఇంతకుముందు విజయవాడలోనూ ఓ చిన్నారిలో లక్షణాలు కనిపించాయి. అయితే పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img