Friday, April 19, 2024
Friday, April 19, 2024

గుజరాత్‌లో రూ.1,125 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

వదోదరలో నిర్మాణంలోని ఫ్యాక్టరీపై దాడి
భారీ విలువ చేసే మత్తు పదార్థాలను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) స్వాధీనం చేసుకుంది. వదోదర పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీపై దాడి చేయగా.. 225 కిలోల మెఫెడ్రోన్‌ బయటపడిరది. దీని విలువ రూ.1,125 కోట్లు ఉంటుందని అంచనా. ఫ్యాక్టరీ భాగస్వాములు ఐదుగురితోపాటు, దినేష్‌ ధృవ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ ను బరూచ్‌ జిల్లా సాంఖ్య జీఐడీసీలో ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో తయారు చేసినట్టు తెలిసింది. ధృవ్‌ నార్కోటిక్స్‌ కేసులో గతంలో 12 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించినట్టు గుర్తించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img