గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెంచేశారు. ఓ వైపు పెట్రోల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతున్న వేళ గ్యాస్ సిలిండర్ ధరపై చమురు సంస్థలు మరోసారి వడ్డించాయి. 14.2కేజీల సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దిల్లీలో సిలిండర్ ధర రూ.899.50కు చేరింది. ఇక 5 కేజీల సిలిండర్ ఇప్పుడు రూ.502కు లభిస్తుంది. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి.