రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇవాళ అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో ఆయన కాసేపు గడిపి చరఖాతిప్పి నూలు వడికారు. చరఖాను ఎలా తిప్పాలో ఆశ్రమంలోని మహిళలు ఆయనకు వివరించారు. విజిటర్స్ పుస్తకంలో ఆయన తన అనుభవాన్ని రాశారు. సబర్మతీ ఆశ్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రపంచాన్ని మార్చడానికి మహాత్మా గాంధీ సత్యం, అహింస వంటి సాధారణ సూత్రాలతో ఎలా పోరాడారో తాను అర్థం చేసుకున్నానని చెప్పారు.