ధరలపై దద్దరిల్లిన పార్లమెంట్
మూడో రోజూ నిరసనల హోరు
ఉభయ సభలు వాయిదా
ధరల పెరుగుదల, నిత్యావసరాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధింపుపై ప్రతిపక్ష పార్టీల నిరసనలతో పార్లమెంట్ మరోసారి దద్దరిల్లింది. సమావేశాల మూడు రోజు బుధవారం కూడా ఉభయ సభల్లోనూ విపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు.