Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చర్చల ద్వారానే పరిష్కారం : రాజ్‌నాథ్‌

చర్చల ద్వారానే రష్యా- ఉక్రెయిన్‌ దేశాలు పరిష్కారం చేసుకోవాలన్నదే తమ అభిమతమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఇరు దేశాలు చర్చల జరుపుకుంటూ, శాంతి స్థాపనకు కృషి చేయాలని సూచించారు. చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయంగా శాంతి స్థాపన జరగాలన్నదే తాము కోరుకుంటున్నామని, భారత్‌ పంథా కూడా అదేనని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి అంతర్జాతీయ సమాజం ఇప్పటికే చొరవ తీసుకుంటోందని, అయినా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img