దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆగడం లేదు. దేశ రాజధాని దిల్ల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 105.49 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 94.22 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.43కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.15 ఉంది. కోల్కతాలో పెట్రోల్ ధర రూ.106.10 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 96.88 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.80 ఉండగా.. డీజిల్ ధర రూ.98.69గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.109.16పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.100గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.49 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.66గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.73 కాగా, డీజిల్ ధర రూ. 102.80గా ఉంది.విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.112.04 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.44 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.110.99 ఉండగా.. డీజిల్ ధర రూ. 103.43గా ఉంది.