ప్రతిపక్ష పార్టీల సభలు, సమావేశాలు, రోడ్ షో లు నిర్వహించకూడదని చెప్పడం దుర్మార్గమన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని కందుకూరు, గుంటూరు ప్రమాద ఘటనలను సాకుగా చూపించి, జగన్ తీసుకుంది నిరంకుశ నిర్ణయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు చేయడం మానుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు మాత్రమే ప్రత్యేక పరిస్థితులు వర్తిస్తాయా? ప్రజల కోసం చేస్తున్న ఉద్యమాలను, ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగంగానే 1861 పోలీస్ యాక్ట్ ఉత్తర్వులు అని సిపిఐ నేత రామకృష్ణ పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో సభలు పెట్టుకునేందుకు అనుమతిస్తామని చెబుతున్నారని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మాత్రమే ప్రత్యేక పరిస్థితులు వర్తిస్తాయా అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదిలా ఉంటే చంద్రబాబునాయుడు సభలకు ప్రజల ఆదరణ ఎక్కువగా ఉందని భావిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇది అప్రజాస్వామిక చర్య అంటూ మండిపడుతున్నారు.