ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిరచవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ కె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరిచంది. ఈ సందర్భంగా కౌంటింగ్పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజనల్ బెంచ్ కొట్టివేసింది. రాష్ట్రంలో 515 జడ్పీటీసీలు, 7,220 ఎంపీటీసీలకు ఈ ఏడాది ఏప్రిల్ 8న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.