జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విజయం సాధించారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై..ఇప్పటికే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడిరది. ఇదంతా భాజపా కుట్ర అని మండిపడిన సోరెన్..తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నించారు. వారిని ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ రిసార్టుకు తరలించారు. తమ మెజార్టీ నిరూపించుకునేందుకు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమే సరైన మార్గం అని భావించారు. ఇప్పుడు ఈ పరీక్షలో నెగ్గారు. ఇందులో సోరెన్ సర్కార్కు 48 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. వెంటనే బీజేపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ముందుగానే ఎమ్మెల్యేలకు లేఖ రాశారు సోరెన్. కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితికి తెర దించాలంటే…ఇదొక్కటే మార్గమని భావించారు. ఈలోగా బీజేపీ కూడా అప్రమత్తమైంది. అసెంబ్లీలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో ముందుగానే లెక్కలు వేసుకుంది. అందుకు అనుగుణంగా…సోరెన్ సర్కార్ను ఇరకాటంలో పెట్టాలని భావించింది. అయితే…సోరెన్ సర్కార్
విజయం సాధించింది.