జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్లో 24 మంది అభ్యర్థులకు నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నారు. వారిలో అత్యధికంగా ఏపీకి చెందిన వారు ఐదుగురు, తెలంగాణకు చెందినవారు ఐదుగురు, రాజస్థాన్ కు చెందినవారు నలుగురు ఉన్నారు. తెలుగు విద్యార్థులు పి.రవిశంకర్ (6వ ర్యాంకు), హిమవంశీ (7వ ర్యాంకు), పల్లి జలజాక్షి (9వ ర్యాంకు) టాప్-10లో నిలవడం విశేషం.