Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ట్విట్టర్‌పై ఎదురుదాడికి దిగిన ఎలాన్‌ మస్క్‌… కౌంటర్‌ దావా దాఖలు

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ మధ్య లీగల్‌ వార్‌ మరింత ముదురుతోంది. ట్విట్టర్‌తో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయంచి టెస్లా అధినేతపై దావా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్‌ దావాను సవాల్‌ చేస్తూ మస్క్‌ కూడా ఆ కంపెనీపై దావా వేశారు. ట్విట్టర్‌ దావాపై ఈ ఏడాది అక్టోబర్‌లో విచరణ జరపనున్నట్లు డెలావర్‌ కోర్టు ఆదేశాలు వెలువరించిన కొద్ది గంటలకే మస్క్‌ ఈ దావా వేయడం గమనార్హం.
44 బిలియన్‌ డాలర్ల డీల్‌ తో ట్విట్టర్‌ కొనుగోలు చేయాలనుకున్న ప్రక్రియ నుంచి వెనక్కుతగ్గిన టెస్లా అధినేతపై ట్విట్టర్‌ న్యాయ పోరాటం చేస్తోంది. ఏకంగా 164 పేజీలతో కూడిన పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై డెలావేర్‌ కోర్టు.. అక్టోబర్‌ 17వ తేదీ నుంచి ఐదు రోజుల విచారణ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ట్విట్టర్‌ న్యాయ పోరాటానికి ప్రతిగా మస్క్‌ కౌంటర్‌ దావా దాఖలు చేశారు.మరోవైపు ట్విట్టర్‌ కొనుగోలు డీల్‌ ను పూర్తి చేసేలా మస్క్‌ ను ఆదేశించాలని కోరుతూ ఆ కంపెనీకి చెందిన ఓ వాటాదారు కూడా కోర్టును ఆశ్రయించారు. కంపెనీ కొనుగోలు ప్రక్రియ నుంచి తప్పుకోవడం ద్వారా మస్క్‌ నిబంధనలు ఉల్లంఘించారని, తద్వారా ట్విట్టర్‌ కు కలిగిన నష్టాలకు ఆయన నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పిటిషన్‌ లో పేర్కొన్నారు. టెస్లా అధినేత అయిన మస్క్‌ జూలై 8న ట్విట్టర్‌ కొనుగోలు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. తమ ఫ్లాట్‌ ఫామ్‌ లోని నకిలీ ఖాతాల సంఖ్యను తప్పుగా సూచించడం ద్వారా ట్విట్టర్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడిరచారు. దీన్ని ఖండిరచిన ట్విట్టర్‌ ఆయనపై దావా వేసింది. తప్పుదోవ పట్టించేందుకే నకిలీ ఖాతాలను ఆయన తెరపైకి తెచ్చారని విమర్శించింది. ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు ఒప్పందానికి మస్క్‌ కట్టుబడి ఉండాలని పేర్కొంది. మస్క్‌ ఈ డీల్‌ నుంచి వెనక్కి తగ్గిన తర్వాత తమ కంపెనీ షేర్లు పడిపోయాయని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img