Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కుమారుడి మృతదేహం కోసం యాచకులైన తల్లిదండ్రులు

మార్చురీ నుంచి కుమారుడి డెడ్‌బాడీని ఇచ్చేందుకు అక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగి రూ. 50 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో తల్లిదండ్రులు భిక్షాటన చేశారు. ఇల్లు ఇల్లు తిరుగుతూ జోలె పట్టి అడుక్కున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని ముశ్రీఘర్హార్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జూన్‌ 6న ఓ మానసిక వికలాంగుడు అదృశ్యమయ్యాడు. స్థానికంగానే ఆ బాలుడు చనిపోయి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. 7వ తేదీన పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమస్తిపూర్‌ సదార్‌ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడ పోస్టుమార్టం అనంతరం.. డెడ్‌బాడీని అప్పగించాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని ఓ ఉద్యోగి డిమాండ్‌ చేశాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ బాలుడి తల్లిదండ్రులు జోలె పట్టి అడుక్కున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. సమస్తిపూర్‌ సదార్‌ హాస్పిటల్‌ ఉన్నతాధికారులకు వీడియోలు చేరడంతో వారు స్పందించారు. తక్షణమే బాలుడి డెడ్‌బాడీని అతని ఇంటికి పంపించేశారు. ఈ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి, విచారణ జరుపుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. విచారణ అనంతరం లంచం డిమాండ్‌ చేసిన ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మార్చురీలో పని చేసే ఉద్యోగి గతంలో కూడా లంచం డిమాండ్‌ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img