Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తగ్గిన కరోనా కేసులు.. 7శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు..!

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులో ఉంది. ముందురోజు కంటే నాలుగువేల మేర కేసులు తగ్గాయి. ఆదివారం 20,279 కేసులు నమోదవగా, తాజాగా 16,866 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,39,05,621కి చేరాయి. ఇందులో 4,32,28,670 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,074 మంది మరణించారు. మరో 1,50,877 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 18,148 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతానికి పెరిగిందని వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.34 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొన్నది. రికవరీ రేటు 98.46 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 202.17 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img