కరోనా ముందునాటికన్నా తక్కువగా నమోదు
అధికారిక గణాంకాలు వెల్లడి
న్యూదిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, హద్దూ, అదుపులేకుండా పెరుగుతున్న ధరల కారణంగా భారత తలసరి ఆదాయం తగ్గింది. 202122 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం కరోనా ముందునాటికన్నా కూడా తక్కువగా నమోదైందని మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాలు తెలిపాయి. 2021
22 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.91,481గా ఉంది. జాతీయ నికర ఆదాయం (ఎన్ఎన్ఐ) ఆధారిత తలసరి ఆదాయం 2022లో 7.5శాతం మేర పెరిగింది. 201920లో రూ.94,270గా ఉంటే అది 2020
21లో రూ.85,110కు తగ్గిపోయింది. ప్రస్తుత ధరల ప్రకారం 202122 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 18.3శాతం పెరిగి రూ.1.5లక్షలకు చేరింది. అదే 2020
21లో రూ.1.27 లక్షలుగా, 2019`20లో రూ.1.32 లక్షలుగా నమోదు అయింది.