అవాక్కయిన ఏఎస్ఐ అధికారులు
చారిత్రాత్మక కట్టడం తాజ్మహల్కి ఆస్తిపన్ను చెల్లించాలని అధికారులు నోటీసులు పంపారు. అంతేకాదు పెండిరగ్ లో ఉన్న వాటర్ బిల్లును కూడా వెంటనే చెల్లించాలని సూచించారు. నిర్ణీత టైం లోగా బిల్లులు చెల్లించకుంటే తాజ్ ను సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న ఏఎస్ఐ అధికారులు అవాక్కయ్యారు. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేసిన నిర్వాకమిది. ఇలాంటి నోటీసులు అందుకోవడం ఇదే తొలిసారి అని, ఇదేదో పొరపాటుగా జరిగి ఉంటుందని చెప్పారు. ఎందుకంటే.. పురాతన, చారిత్రక కట్టడాలకు పన్నులు వర్తించవని వివరించారు.