Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

తుపానుపై అప్రమత్తంగా ఉండండి: సీఎం జగన్‌

తుపానుపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ఏపీ సీఎం జగన్‌ సూచించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం సీఎంఓ అధికారుల సమావేశంలో తుపాను పరిస్థితులపై సీఎం సమీక్షించారు. తుపాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కలిగించాలని, వారికి సహాయకారిగా నిలవాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img