తెలంగాణ, ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో ఇవాళ భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది ఒడిశా రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీచేసింది. కేరళలోని ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. కేరళలో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒడిశా రాష్ట్రంలోని గజపతి, గంజాం, రాయగడ, కోరాపుట్ మరియు మల్కన్ గిరి జిల్లాల్లో శనివారం భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపారు. తెలంగాణాలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాజధాని నగరమైన హైదరాబాద్ నగరంలో శనివారం ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.శనివారం ఆంధ్రప్రదేశ్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ అధికారులు సూచించారు. ఉత్తర కోస్తాంధ్రలోని చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని