Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

త్వరగా కోలుకోవాలి..మన్మోహన్‌ జీ…

ప్రధాని మోదీ ట్వీట్‌
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం ట్వీట్‌ చేశారు. మన్మోహన్‌ సింగ్‌ అకస్మాత్తుగా క్షీణించడంతో ఆయన ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ చేరిన సంగతి తెలిసిందే. ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయనకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. జ్వరం, నీరసంతోనూ ఆయన బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆయన్ను పరామర్శించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సింగ్‌ మంచి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక హ్యాండిల్‌లో ఒక ట్వీట్‌ను పోస్ట్‌ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా పాజిటివ్‌ అని తేలడంతో సింగ్‌ గతంలో ఎయిమ్స్‌లో చేరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img